Breaking News

20/11/2019

శాసనమండలి లో కమిటీ భేటీ

హైదరాబాద్ నవంబర్ 20 (way2newstv.in):
 శాసన పరిషత్  వ్యవహారాల్లో   పేపర్స్ లూయిడ్ ఆన్ టెబుల్  కమిటీ ప్రాధాన్యత చాలా ఉంటుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శాసన మండలి కమిటీ హాల్ లో జరిగిన మొదటి సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాల్లో   దిశ నిర్ధేశం చేసే పాత్ర లో కమిటీల పాత్ర ముఖ్యమైనదని అన్నారు.  
శాసనమండలి లో కమిటీ భేటీ

పత్రాలు వాటిలో ఉన్న లోటుపాట్లను కూడా ఈ కమిటీ పరిశీలించి ముందుకు తీసుకెళ్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.  చేసిన చట్టాలు నివేదికలు ఎలా వస్తున్నాయి, వాటి ఆలస్యానికి కారణం ఏంటి భవిష్యత్తులో ఆలస్యం జరక్కుండా వాటిలోని లోటుపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ కమిటీ పై ఉంటుందని అన్నారు.  ఈ సమావేశం లో   శాసన పరిషత్ సభా పత్రాల కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జాఫ్రీ , సభ్యులు బాలసాని లక్ష్మీ నారాయణ, నవీన్ కుమార్, శాసన సభ కార్యదర్శి నర్సింహా చార్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment