Breaking News

20/11/2019

25 న పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్

నెల్లూరు, నవంబర్ 20  (way2newstv.in)
చంద్రయాన్‌-2తో మరో మైలురాయిను అధిగమించి, అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  సత్తా చాటింది. తాజాగా, నవంబరు, డిసెంబరులో మరో మూడూ కీలక ప్రయోగాలకు సిద్ధమైంది. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని నవంబరు 25న ప్రయోగించనున్నారు. ఈ మేరకు ఇస్రో మంగళవారం ప్రకటించింది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు.పీఎస్‌ఎల్‌వీ-సీ47 ద్వారా ప్రయోగించే ఈ ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 
25 న పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నవంబరు 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సూర్యుని స్థిర కక్ష్యలోకి పంపుతారు. కార్టోశాట్‌-3తోపాటు అమెరికాకు చెందిన ఎన్‌ఎస్‌ఐఎల్‌ సహకారంతో రూపొందించిన 13 వాణిజ్య నానో ఉపగ్రహాలనూ ప్రయోగిస్తారు.అలాగే రిశాట్-2బీఆర్1, రిశాట్-2బీఆర్2లను పీఎస్‌ఎల్వీ-సీ48, సీ49 ద్వారా డిసెంబరులో నింగిలోకి పంపనున్నారు. ఈ ఏడాదిలో మే రిశాట్-2బీ, ఏప్రిల్ 1న ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ (ఎమిశాట్)ను ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలు శత్రు రాడార్ల కదలికలపై స్పష్టమైన సమాచారం చేరవేస్తాయి. ఈ ప్రయోగం జరిగిన ఆరు నెలల తర్వాత చంద్రయాన్ -2‌ను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.ఇక, ఇస్రో చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీహరికోట నుంచి ఒకే ఏడాది ప్రయోగించిన అన్ని ఉపగ్రహాలు సైనిక ప్రయోజనం కోసం ఉద్దేశించినవి కావడం విశేషం. రిశాట్2బీఆర్1‌తోపాటు జపాన్‌కు చెందిన క్యూపీఎస్-ఎస్ఏఆర్ మైక్రోశాటిలైట్‌, పీఎస్‌ఎల్వీ-సీ48 ద్వారా, రిశాట్-2బీఆర్2తోపాటు లగ్జెంబర్ సంస్థ క్లేయిస్ స్పేస్ అభివృద్ధి చేసిన నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు.

No comments:

Post a Comment