Breaking News

24/10/2019

కేంద్ర సర్వీసులకు అకున్

హైద్రాబాద్, అక్టోబరు 24 (way2newstv.in)
ఐజీ అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్లనున్నారు. ఆయనకు సెంట్రల్ ఇంటెలిజెన్స్‌లో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి ఆయన సోమవారం రిలీవ్ కానున్నట్లు సమాచారం. 
కేంద్ర సర్వీసులకు అకున్

అకున్ సబర్వాల్ స్థానంలో కేసీఆర్ సర్కార్.. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సత్యనారాయణ రెడ్డిని నియమించింది.రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అకున్ సబర్వాల్ కీలక విధులు నిర్వహించారు. టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయంలో ఆయన ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నారు. అకున్ సబర్వాల్ సతీమణి స్మితా సబర్వాల్ ప్రస్తుతం తెలంగాణ సీఎంవోలు కీలక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment