Breaking News

05/10/2019

సరస్వతిదేవిగా జగన్మాత దుర్గమ్మ

విజయవాడ  అక్టోబరు 5, (way2newstv.in)
ఇంద్రకీలాద్రిపై శనివారం జగన్మాత దుర్గమ్మ సరస్వతిదేవిగా దర్శనమిచ్చారు.  శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు కుటుంబసమేతంగా అమ్మవారిని దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్బాబు, నగర పోలీస్ కమీషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు దంపతులుతొలిగా దర్శించుకున్నారు. 
సరస్వతిదేవిగా జగన్మాత దుర్గమ్మ

రెండు గంటలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీకేసినేని శ్రీనివాస్ (నాని)  కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. నవరాత్రుల్లో నిర్విరామంగా 23 గంటల పాటు  కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.  అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు.  జై..భవానీ... జైజై జగజ్జననీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి  మారుమ్రోగింది.

No comments:

Post a Comment