Breaking News

31/10/2019

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం... ఆర్టీసీపైనే దృష్టి

హైదరాబాద్అక్టోబర్ 31(way2newstv.in):
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. ఈ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రత్యేకించి ఈ నెల ఐదవ తేదీ నుంచి మొదలై, ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఈ క్రమంలో జరిగిన ఆత్మహత్యలు... తదితర పరిణామాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇక ప్రధానంగా ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనుంది. 
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం... ఆర్టీసీపైనే దృష్టి

ఇందులో భాగంగా రూట్ల ప్రైవేటీకరణపై ఓ విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో... రూట్ల ప్రైవేటీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం... ఆ తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నట్లు వినవస్తోంది. ఇదిలా ఉంటే... రూట్ల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తోందంటే... కార్మికులను సమ్మె నుంచి తప్పించేందుకే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూట్ల ప్రైవేటీకరణ అంశాన్ని తెరమీదకు తెచ్చారని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment