Breaking News

02/10/2019

మహాత్ముడి స్ఫూర్తితో గ్రామ సచివాలయాలు : జగన్

కాకినాడ, అక్టోబరు 2, (way2newstv.in)
జాతిపితను తలచుకోగానే అహింస, సత్యాగ్రహం గుర్తుకొస్తాయి. వాటినే ఆయన ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ వారిపై పోరాడారు. గ్రామాలే దేశానికి వెన్నెముక.. అవి లేనినాడు దేశమే లేదన్న మహాత్ముడి మాటలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామ సచివాలయాల వ్యవస్థకు అంకురార్పణ చేశాం’ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో తొలి గ్రామ సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు.కరపలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. పరిపాలన ప్రతి గడపకూ తీసుకెళ్లాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు వేల మందికి పది నుంచి 12 మంది కొత్త ఉద్యోగులను నియమించాం. ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్‌ను నియమించాం. అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందించేందుకు ఈ రెండు వ్యవస్థలు పని చేస్తామన్నారు. 
మహాత్ముడి స్ఫూర్తితో గ్రామ సచివాలయాలు : జగన్

నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 44 వేల ఉద్యోగాలు ఇవ్వడం ఒక రికార్డ్ అని జగన్ పేర్కొన్నారు.పాదయాత్రలో గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చూశా. ప్రభుత్వమే లేదన్న పరిస్థితి. మంచినీరు, మంచి బడి, మంచి వైద్యం లేని దుస్థితి. రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, ఇంటి స్థలం.. ఇలా ఏది కావాలన్నా లంచం. ఎవరికి ఓటేశావని జన్మభూమి కమిటీ సభ్యులు అడుగుతారు. అలాంటి సమస్యలు ఉండకూడదన్న సదుద్దేశంతోనే గ్రామ సచివాలయాల వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. అన్ని ప్రభుత్వ సేవలను డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.జనవరి ఒకటి నాటికి గ్రామ సచివాలయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. మొత్తం 35 శాఖలకి సంబంధించిన దాదాపు 500 సేవలను పొందవచ్చు. ఫిర్యాదుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, అది నేరుగా సీఎం పేషీకి అనుసంధానమై ఉంటుందన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే ఒక్క ఫోన్ కాల్ చేయాలని సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుని గ్రామాల్లోని పాఠశాలలు, ఆస్పత్రులను మెరుగుపరుస్తామన్నారు.మహాత్ముడి స్ఫూర్తిగా బెల్టు షాపులను రద్దు చేసిన ప్రభుత్వం తమదని గర్వంగా చెబుతున్నానని జగన్ అన్నారు. గతంలో సుమారు 4500 మద్యం దుకాణాలుండేవి, 43 వేల వరకూ బెల్టు షాపులుండేవన్నారు. ప్రైవేటు మద్యం వ్యాపారుల లాభాపేక్షతో గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టుకొచ్చేవి. అందుకే మద్యం విక్రయాలు కూడా ప్రభుత్వమే చేపట్టిందని తెలియజేశారు. బెల్టు షాప్ పెడితే ఒక్కఫోన్ కొట్టండి చాలు.. ప్రభుత్వమే కదులుతుందని సీఎం జగన్ తెలిపారు. చివరగా గ్రామ సచివాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రికమండేషన్లు లేకుండా, రూపాయి లంచం ఇవ్వకుండా ఉద్యోగాలు పొందారని, అందరూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా పనిచేయాలని సూచించారు.

No comments:

Post a Comment