Breaking News

18/10/2019

కేసీఆర్ పై రేవంత్ మరోమారు సంచలన వ్యాఖ్యలు

యాదాద్రి అక్టోబరు 18 (way2newstv.in)  
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 85 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారన్నారు. 
కేసీఆర్ పై రేవంత్ మరోమారు సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వంతో కొట్లాడి ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రేపటి బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని రేవంత్ పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment