Breaking News

24/10/2019

షాద్ నగర్ లో ఆర్టీసీ సమ్మె సభలో పాల్గొన్న అశ్వథామ రెడ్డి.

షాద్ నగర్ అక్టోబర్ 24 (way2newstv.in)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఆర్టీసీ  సమ్మె సభలో పాల్గొని ఆర్టీసీ కార్మికులకు మద్దత్తు తెలిపిన  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వథామ రెడ్డి. ఈసందర్భంగా మాట్లాడుతూ మేము కోరే కోరికలు గొంతెమ్మ కోరికలు కావు, ప్రజా రవాణ ను రక్షించమని కోరుతున్నాం అన్నారు. 
షాద్ నగర్ లో  ఆర్టీసీ  సమ్మె సభలో పాల్గొన్న అశ్వథామ రెడ్డి.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కొత్తవి రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, డీజిల్  భారంతోనే ఆర్టీసీకి  నష్టాలు  వస్తున్నాయి అన్నారు. హైకోర్టు లో చెప్పిన అంశాలను సైతం వక్రీకరిస్తున్నారు అన్నారు. ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచిందని ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దు అన్నారు. రాజకీయాలకు, మన ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

No comments:

Post a Comment