Breaking News

17/09/2019

సీఎం కేసీఆర్ మాట తప్పారు: లక్ష్మణ్

హైదరాబాద్ సెప్టెంబర్ 17, (way2newstv.in)
నిజాంపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం వీరోచిత పోరాటం చేసిందని, విమోచనదినాన్ని అధికారికంగా జరపాలన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మజ్లిస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. 
సీఎం కేసీఆర్ మాట తప్పారు: లక్ష్మణ్

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టుపెట్టారని, తెలంగాణలో రాచరిక వ్యవస్థను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచనదినం జరుపుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అంతకుముందు బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, బీజేపీ నేతలు డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు

No comments:

Post a Comment