Breaking News

26/09/2019

నాగార్జున రెడ్డి టీడీపీ ఏజెంట్

తాడేపల్లి సెప్టెంబర్ 26, (way2newstv.in)
చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తూ సమాజాన్ని తప్పుదోవపట్టించేవిధంగా ప్రవర్తించడం సరికాదని మాజీ ఎంఎల్ ఏ ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. గురువారం అయన వైకాపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు. ఇటీవల ఎన్నికలలో టిడిపి ఏజంట్ గా ఉన్నాడు. కరణం బలరామ్ కు కూడా అత్యంత సన్నిహితుడిగా మారిటిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.  కౌంటింగ్ ఏజంట్ గా ఉన్నప్పటికి చంద్రబాబు, నాగార్జునరెడ్డి మా వాడు అని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అతనిపై 17 క్రిమినల్కేసులు ఉన్నాయి. మహిళలను వేధించిన కేసులు కూడా వాటిలో ఉన్నాయని అయన అన్నారు.  భార్యను వేధించడం, రేప్ కేసు ఇతర కేసులు వాటిలో చంద్రబాబు సిఎంగా ఉన్నహయాంలో నమోదైనవి కూడా ఉన్నాయి. 
నాగార్జున రెడ్డి టీడీపీ ఏజెంట్

నాగార్జున రెడ్డి మహిళా అధికారిపై రాసిన భాష చూస్తే జర్నలిస్ట్ అంటారా? అంగపూజ చేస్తున్నారంటూ మహిళా అధికారి గురించిఅభ్యంతరకరంగా రాశారు. అతను రాసిన వార్తల ఆధారాలు మీకు చూపుతాను.ఇది జర్నలిజం అంటారా అని ప్రశ్నించారు. ఛాన్ భాషాఅనే యువ అధికారిపై అభ్యంతరకరంగా భాషఉపయోగిస్తూ వార్తలు రాశాడు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ ఐవి సుబ్బారావు అనే వ్యక్తి అతని గురించి ఏం పోస్టులు పెట్టారో అడగండి చెబుతారు.నేను ప్రస్తావించిన అంశాలన్ని కూడా 17 కేసులలో ఉన్నాయి. మా ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాబట్టి నాకు ఆపాదించారంటే అర్దం ఉంటుంది.నిజానిజాలు పోలీసులు తేలుస్తారనిఅన్నారు. వైయస్ జగన్ నీతినిజాయితీ ముందు చంద్రబాబు సరిపోడు. చంద్రబాబు ఆధ్వర్యంలో వంగవీటి రంగా హత్య జరిగితే వేయి కోట్ల మేర ఆస్దులు ధ్వంసం అయ్యాయి. ఆ కేసులోఒక చిన్నవ్యక్తికి కూడా శిక్ష పడకుండా చేసిన వ్యక్తివి నీవు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెరుకులపాడు నారాయణరెడ్డిని ఏ విధంగా చంపారో ప్రజలకు తెలుసు.అది అరాచకం అంటే.దానికి ప్రజలు కూడా చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని అన్నారు.  కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే అంతిమయాత్రలో పాల్గొని చంద్రబాబు విక్టరీ సింబల్ రెండువేళ్లు చూపించాడు.అది ఎంత దారుణం. కోడెల మృతదేహంముందు సంతోషంతో ఉన్నట్లు తెలుగురాష్ట్రాలలో ప్రచారం జరిగింది.  వైయస్ జగన్ నీతినిజాయితీ ముందు చంద్రబాబుసరిపోడు.చాలామంది టిడిపిని వదిలివేసి క్యూలో నిల్చున్నారు.వెళ్లిపోవడానికి సిధ్దంగా ఉన్నారని అయన వెల్లడంచారు.  నాగార్జునరెడ్డిపై దాడి కేసులో దాడిజరిగిన 12 గంటలలోనేఆరుగురుని అరెస్ట్ చేశారు.వెహికల్ ను కూడా సీజ్ చేశారు. అదే చంద్రబాబు హయాంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ,ఆయన వర్గీయుల చేతిలో శంకరయ్య అనే ఆంధ్రప్రభ రిపోర్టర్ నుచంపితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నాగార్జునరెడ్డిపై దాడిని మేం కూడా ఖండిస్తున్నాను. వాటిని సమర్దించేవాళ్లం కాదు.దాడివేరు.జర్నలిజానికి ఆపాదించడం సరికాదని అన్నారు. గతమూడు రోజులుగా నాగార్జున రెడ్డికి ఎవరూ కూడా మధ్దతు తెలియచేయలేదు. చంద్రబాబు రాజకీయంగా చచ్చిపోయాడనే ఆనందంలో ప్రజలు ఉన్నారు.భవిష్యత్తులో కూడా అదేభావనలో ఉంటారు.నీపై సానుభూతి లేదు. అక్రమకట్టడంలో నివాసం ఉంటూ రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ గురించి నీకు తెలియదా అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment