Breaking News

24/09/2019

ఏడాది గరిష్టానికి పెట్రోల్ ధర..

ముంబై, సెప్టెంబర్ 24  (way2newstv.in)    
దేశీ ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 15 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.78.80కు చేరింది. డీజిల్ ధర రూ.73.11కు ఎగసింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. దేశీ ఇంధన ధరలు 8 రోజులుగా ప్రతి రోజూ పెరుగుతూ రావడం గమనార్హం. ఈ కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.2, డీజిల్ ధర రూ.1.63 చొప్పున పెరిగింది.
ఏడాది గరిష్టానికి పెట్రోల్ ధర..

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 23 పైసలు పెరుగుదలతో రూ.78.47కు చేరింది. డీజిల్‌ ధర కూడా 14 పైసలు పెరుగుదలతో రూ.72.44కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 23 పైసలు పెరుగుదలతో రూ.78.10కు చేరింది. డీజిల్ ధర కూడా 15 పైసలు పెరుగుదలతో రూ.72.10కు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 22 పైసలు పెరుగుదలతో రూ.74.13కు చేరింది. ఇది ఏడాది గరిష్ట స్ఠాయి. డీజిల్ ధర కూడా 14 పైసలు పెరుగుదలతో రూ.67.07కు ఎగసింది. ఇది 7 నెలల గరిష్ట స్థాయి. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 22 పైసలు పెరుగుదలతో రూ.79.79కు చేరింది. డీజిల్ ధర కూడా 15 పైసలు పెరుగుదలతో రూ.70.37కు ఎగసింది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.31 శాతం తగ్గుదలతో 63.53 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.27 శాతం క్షీణతతో 58.48 డాలర్లకు తగ్గింది.

No comments:

Post a Comment