Breaking News

21/09/2019

జూరాలలో సోలార్ ప్రాజెక్టు...

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21, (way2newstv.in)
జూరాల, లోయర్‌ జూరాల ప్రాజెక్టుల వద్ద మరో 19 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రం వద్ద ఐదు ఎకరాల్లో ఒక మెగావా ట్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కేంద్రం విజయవంతమైంది. ఈ ప్రాంతంలో అ న్ని సీజన్లలోనూ పగటి పూట 30 డిగ్రీలకు తగ్గకుండా ఎండ తీవ్రత ఉంటుంది. కాబట్టి సోలా ర్‌ విస్తరణకు సరైన ప్రాంతం కావడంతో విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా విద్యుదుత్పత్తి చేయడంతోపా టు ప్రాజెక్టుల వద్ద మిగులు భూముల్లో సోలార్‌ పవర్‌ విస్తరణకు మొగ్గుచూపుతున్నారు. 
జూరాలలో సోలార్ ప్రాజెక్టు...

ఎగువ జూరాల ప్రాజెక్టు వద్ద 2012 నుంచి ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి నిరాటంకంగా సాగుతోంది. దీంతో జూరాల వద్ద మిగులుగా ఉన్న మరో 50 ఎకరాల భూమిలో మరో 8 మెగావాట్ల విద్యుత్‌ను అందించేలా సోలార్‌ యూనిట్‌ను విస్తరించాలని నిర్ణయించారు. లోయర్‌ జూరాల వద్ద మిగులుగా ఉన్న సాగునీటి శాఖకు చెందిన 90 ఎకరాల భూమిలో మరో 11 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటులో ఒక మెగావాట్‌ విద్యుత్‌ను అందించేలా సోలార్‌ యూనిట్ల పరికరాలను అమర్చడానికి రూ.3 కోట్ల మేర వ్యయమవుతుంది. జూరాల, లోయర్‌ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో సాగునీటి శాఖ వద్ద మిగులుగా ఉన్న భూముల్లో సోలార్‌ యూనిట్లను నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందించారుపులిచింతల ప్రాజెక్టు వద్ద 20 మెగావాట్లు, పాల్వంచ కేటీపీఎస్‌ వద్ద 8 మెగావాట్లు, పెద్దపల్లి వద్ద 5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నిర్మించేందుకు ఇప్పటికే డీపీఆర్‌ చేశారు. వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. కేటీపీఎస్, పులిచింతల, పెద్దపల్లి ప్రాజెక్టుల మిగులు భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా మొదటి దశ పనులకు రూ.75 కోట్లతో టెండర్లను పూర్తి చేయడంతోపాటు ఒప్పందాలు చేయడంతో పనులు ప్రారంభం కానున్నాయి. జూరాల, లోయర్‌ ప్రాజెక్టుల వద్ద సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచితే వేసవిలో గ్రిడ్‌ ద్వారా ఈ ప్రాంతానికి విద్యుత్‌ను అందించేందుకు మరింత సౌలభ్యం ఏర్పడనుంది.

No comments:

Post a Comment