Breaking News

18/09/2019

హౌడీ మోడీకి భారీ ఏర్పాట్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 (way2newstv.in)
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం మోదీ పర్యటన విశేషాలను ట్వీట్ చేసింది. ఇందులో ప్రధానంగా హౌడీ-మోడీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఈ నెల 22న హూస్టన్‌ ఎన్‌ఆర్‌జి స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో 50 వేలమందికి పైగా ఎన్నారైలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అయితే హౌడీ-మోడీ సభలో మాట్లాడే అంశాలను ట్విట్టర్ ద్వారా ప్రధానికి సూచించాలని ఇప్పటికే  పీఎంవో కార్యాలయం పిలుపునిచ్చింది. 
హౌడీ మోడీకి భారీ ఏర్పాట్లు

ఇదిలా ఉంటే హౌడీ-మోడీ సభకు తాను కూడా హాజరుఅవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా ట్రంప్ మోడీ ఇరువురు చివరిసారిగా గత నెల ఆగస్టులో జీ7 సదస్సులో భేటీ అయ్యారు. హౌడీ మోడీ భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఇందులో ప్రధానంగా భారత ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల గురించి ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో పంచుకోనున్నారు. ఇదిలా ఉంటే హౌడీ మోడీ కార్యక్రమంపై వైట్ హౌస్ స్పందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఈ భేటీ ఉపయోగపడే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ పేర్కొంది.

No comments:

Post a Comment