Breaking News

20/09/2019

రేవంత్ వ్యవహారం పై క్రమశిక్షణ కమిటీ లో చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (way2newstv.in)
రేవంత్ రెడ్డి వ్యవహారం పై క్రమశిక్షణ కమిటీ లో చర్చించాం. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతోమాట్లాడారు.  అసెంబ్లీ లో మొదటి  రెండు రోజులు మా ఎమ్మెల్యే లు మాట్లాడిన తీరు వల్ల పార్టీ  గ్రాఫ్ పెంచుకుంటె మూడో రోజు రేవంత్ వచ్చి విద్యుత్ సమస్య మట్లాడ లేదని గ్రాఫ్ తగ్గించాడని అయనవ్యాఖ్యానించారు.
రేవంత్  వ్యవహారం పై క్రమశిక్షణ కమిటీ లో చర్చ

ఎప్పుడు ఎం మాట్లాడాలనేది సభ్యులు నిర్ణయించుకుంటారు. సంపత్ కు సెల్ఫీ అవసరం లేదు. ఆయన పక్కనే చాలా మంది నిలబడి సెల్ఫీ తీసుకుంటారు. సంపత్ విషయంలోరేవంత్ మఆట్లాడిన తీరు సరైంది కాదని అన్నారు. యురేనియం విషయంలో వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే ఏఐసీసీ కి రిపోర్ట్ ఇచ్చారు. యురేనియం విషయంలో జనసేన ఆధ్వర్యంలోకాంగ్రెస్ పోవడం మేం చేసింది తప్పే నని అయన అంగీకరించారు.

No comments:

Post a Comment