Breaking News

16/09/2019

ప్రశ్నిస్తే ఆరెస్టులా ?

విజయవాడ, సెప్టెంబర్ 16 (way2newstv.in)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరెస్టును బీజేపీ నేతలు  ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి మీడియాతో మాట్లాడుతూ ఇది ఆంధ్రప్రదేశా, ఆఫ్ఘనిస్తానా అని ప్రశ్నించారు.ప్రశ్నిస్తే అరెస్టులా అని మండిపడ్డారు. నేను ఉన్నాను అంటే అభివృద్ధి చేయడానికి అనుకున్నాం.. గానీ అరాచకనికి అని అనుకోలేదు. 
ప్రశ్నిస్తే ఆరెస్టులా ?

నేను విన్నాను అంటే ప్రజావాణి వినడానికి అనుకున్నాం.. గానివిని పోలీసులతో అరెస్ట్లు చేయించడానికి అని అనుకోలేదని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వైసీపీ కి టీడీపీ కి పట్టిన గతే పడుతుంది.  ఢిల్లీ లో వంగి వంగి మోదీ గారికి దణ్ణాలు పెట్టిఇక్కడ క్యాడర్ ని హింసించి, మా నాయకుడిని అరెస్టు చేస్తూ మీ డబల్ స్టాండ్ బుద్ధి చూపించారని ఆరోపించారు. చంద్రబాబుది యూ  టర్న్..వైసీపీది రివర్స్ టర్న్ అని అన్నారు. రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడిందని అన్నారు.

No comments:

Post a Comment