Breaking News

17/09/2019

ఉర్దూ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 17, (way2newstv.in)
రాష్ట్రంలో ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2017 డీఎస్సీలో మొత్తం 8,729 పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టగా.. ఇందులో ఉర్దూ మీడియం పోస్టులు 900 ఉన్నాయని తెలిపారు. 
ఉర్దూ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

అయితే 336 మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలు 1109 ఉన్నాయని తెలిపారు. 5,964 పోస్టుల భర్తీ చేపట్టగా, 4,418 మందిని నియామకం అయ్యారు. ఉర్దూ మీడియం పాఠశాల్లోనే సమస్యలు లేవు. అన్ని పాఠశాలల్లో సమస్యలున్నాయని మంత్రి చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కారిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment