Breaking News

11/09/2019

మళ్లీ పడిపోయిన బంగారం ధర

ముంబై, సెప్టెంబర్ 11, (way2newstv.in)
పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.39,770కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్లబంగారం ధర కూడా రూ.140 తగ్గుదలతో రూ.36,450కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. 
మళ్లీ పడిపోయిన బంగారం ధర

కేజీ వెండి ధర రూ.53,200 వద్ద నిలకడగా ఉంది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.38,400కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గుదలతో రూ.37,200కు తగ్గింది. ఇక కేజీ వెండిధర స్థిరంగా ఉంది. రూ.53,200 వద్దనే కొనసాగుతోంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1,499.45 డాలర్లకు చేరింది.అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 18.17 డాలర్లకు చేరింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడిధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment