Breaking News

04/09/2019

సెప్టెంబర్ 7 లోగా వైద్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా  కలెక్టర్ శ్రీ దేవసేన
పెద్దపల్లి   సెప్టెంబర్ 04  (way2newstv.in)
జిల్లాలోని   ప్రభుత్వ ఆసుపత్రులలో  విధులు నిర్వహించుటకు సెప్టెంబర్ 7,2019లోగా  దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్  శ్రీ దేవసేన  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య విధాన్ పరిషత్ లో ఖాళీగా ఉన్న  పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది, 
సెప్టెంబర్  7  లోగా వైద్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో  జిల్లా కలెక్టర్  కార్యాలయంలో  సెప్టెంబర్  7,2019  న  హాజరుకావాలని, జిల్లాలో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు(వేతనం రూ.40270/-, ఏదైనా పీజీ స్పెషలిస్టు), 2 పిల్లల వైద్యులు(వేతనం 80000/-,ఎండి పాడ్రియాటిక్), 2 స్త్రీల వైద్య నిపుణులు( వేతనం రూ.1 లక్ష ఎంఎస్(ఒబిజె)) , 2 మత్తు వైద్య నిపుణులు ( వేతనం రూ.1 లక్ష,  ఎండి అనస్తిషియా) దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో  పేర్కొన్నారు.

No comments:

Post a Comment