Breaking News

20/08/2019

బ్యాంకును ముట్టడించిన రైతులు


తుగ్గలి  ఆగష్టు 20 (way2newstv.in - Swamy Naidu):
మండల కేంద్రమైన తుగ్గలిలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నందు 2018 సంవత్సరంనకు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ ను రైతుల ఖాతాలో జమ చేయాలని సంబంధిత రైతులు బ్యాంకును ముట్టడించారు.మండల పరిధిలోని పెండేకల్ మరియు జొన్నగిరి బ్యాంకులకు సంబంధించి 2018 సంవత్సరపు ఇన్సూరెన్స్ ను రైతుల ఖాతాల్లో జమ చేశారని,తుగ్గలి బ్యాంకు సంబంధించిన రైతుల ఖాతాలో కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ జమ చేయాలని రైతులు బ్యాంకును ముట్టడించారు.
బ్యాంకును ముట్టడించిన రైతులు
దీనిపై సిపిఐ నాయకులు మరియు గ్రామ రైతులు బ్యాంకు సిబ్బందిని వివరణ కోరగా సోమవారం రోజున రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలియజేశారు.బ్యాంకు మేనేజర్  లేనందువలన రైతుల ఖాతాల్లో ఇన్సూరెన్స్ జమ చేయడంలో జాప్యం జరిగిందని తెలియజేశారు.2018 నకు సంబంధించిన రైతుల ఇన్సురెన్సు జాబితాను సిద్ధం చేశామని, సోమవారం రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని రైతులకు తెలియజేశారు.బ్యాంకు సిబ్బంది వివరణ ఇవ్వడంతో రైతులు శాంతించారు,అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది బ్యాంకు సేవలు ఎటువంటి ఆటంకం కలగకుండా రైతులను పంపించివేశారు.

No comments:

Post a Comment