Breaking News

07/08/2019

పోంగుతున్న వాగులు, వంకలు

ములుగు,  ఆగస్టు 7 (way2newstv.in)
ములుగు జిల్లా మంగపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు ,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మల్లూరు వాగు పొంగడంతో నర్సింహసాగర్,శనగకుంట,పూరేడుపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు  గ్రామాలకు మండల కేంద్రానికి మధ్య ఈ వాగు పై బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పక్కనే తాత్కాలికి రోడ్ ఏర్పాటు చేశారు. 
పోంగుతున్న వాగులు, వంకలు

వాగు ప్రవాహం పెరగడంతో వరద తాకిడికి వారం రోజుల క్రిందట ఆ రోడ్డు కొట్టుకుపోయింది, దీంతో సదరు కాంట్రాక్టర్ వర్షాలు తగ్గిన సమయంలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశాడు. కానీ మళ్ళీ వర్షం కురవడంతో అదే పరిస్థితి. ఇప్పుడు వాగు దాటితేనే విద్య, వైద్యం, అందుతుంది, పాఠశాల కి వెళ్లే విద్యార్థులు రోజు ఈ వాగు దాటి వెళ్లాల్సిందే. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment