Breaking News

28/08/2019

నాలుగు రాజధానులపై టీజీ మరోసారి వ్యాఖ్యలు

కర్నూలు,ఆగస్టు 28, (way2newstv.com)
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో మాట్లాడుతూ రాజధాని గురించి జగన్ బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చించలేదని చెప్పారు.కేవలం జగన్ ఢిల్లీ నాయకులతో మాట్లాడి నాలుగు రాజధానిల అంశంపై చర్చించినట్లు స్పష్టం చేశారు.
నాలుగు రాజధానులపై టీజీ మరోసారి వ్యాఖ్యలు

రాష్ట్రం లో గుండాలు రాజకీయ నాయకులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ రద్దు చేసి నాలుగు రాష్ట్ర ప్రణాళికలు బోర్డులను జగన్ తయారు చేస్తున్నారని అందుచేత నేను 4 రాజధానులు ఏర్పాటు పై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రల్లో బీజేపీ జెండా కచ్చితంగా ఎగరవేస్తామని,కర్నూల్ లో రాజధాని ఏర్పాటు కోసం భూములు లెవని చెప్పిన టీజీ వెంకటేష్ ... రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోవడంతో ప్రజలకు అందించలేకపోతు న్నామని చెప్పారు.

No comments:

Post a Comment