జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి ,ఆగస్టు 08 (way2newstv.in - Swamy Naidu ):
సకాలంలో స్కాలర్ షిప్ కొరకు ఆసక్తి గల మైనార్టి విద్యార్థు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 సంవత్సరమునకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్ లకు మైనార్టీ విద్యార్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకొనుటకు ఫ్రెష్ మరియు రెనివల్ చేసుకునే ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్.
సకాలంలో స్కాలర్ షిప్ కొరకు మైనార్టి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
( 1 తరగతి నుండి 10 వ తరగతి వరకు) గల విద్యార్థులకు ఆగస్టు 15, 2019 వరకు మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఇంటర్ నుండి పీహెచ్డీ వరకు) గల విద్యార్థులకు ఆగస్టు 31,2019 వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు కాలేజీలలో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు మరియు మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్ షీప్ లు జాబితాలో పేర్కొన్న అండర్ గ్రాడ్యువేట్, పోస్ట్ గ్రాడ్యువేట్ టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న అర్హత గల్గిన మైనార్టీ, ఆన్ లైన్ లో నమోదు చేసిన ధరఖాస్తుతోపాటు సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధిత చదువుతున్న సంస్థలలో, కేంద్రములలో ఇవ్వగలరు మరియు కావలసిన డాక్యుమెంట్స్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment