Breaking News

29/08/2019

మందు మాన్పించేందుకు 500 కోట్లు

హైద్రాబాద్, ఆగస్టు 29, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యపాన నిషేధం కోసం డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. మద్యపానం వల్ల ఎలాంటి అనారోగ్యాలు, అనర్థాలు వస్తాయనే అంశాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా చేర్చాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఏపీలో మద్యపాన నిషేధానికి సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత లిక్కర్ సేల్స్ తగ్గాయని అధికారులు చెప్పారు. 2018-19 ఏడాదిలో 125లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి.
మందు మాన్పించేందుకు 500 కోట్లు

అయితే, ఈ ఏడాది జూలై వరకు వాటితో పోలిస్తే 12లక్షల కేసులు తగ్గాయని సీఎం జరిపిన సమీక్షలో అధికారులు జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. మరోవైపు లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఇటీవలే అసెంబ్లీలో కొత్త మద్యం పాలసీకి కూడా ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో ప్రభుత్వం 503 మద్యం దుకాణాలను తెరవనుంది. ప్రస్తుతం ఉన్న 4380 మద్యం షాపులను 3500కు తగ్గించనుంది. డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుతో పాటు కల్తీ మద్యం తయారు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

No comments:

Post a Comment