విజయవాడ, ఆగస్టు 29(way2newstv.in)
ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 29, 30 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహింస్తున్నారు. మొత్తం 6,195 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఏపీపీఎస్సీ వారం క్రితమే విడుదల చేసింది. ఏపీలో మొత్తం 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి మే 5న ఏపీపీఎస్సీ ప్రాథమిక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
కొనసాగుతున్న గ్రూప్ 2మెయిన్ పరీక్షల నిర్వహణ
ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,28,263 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,77,876 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీటి ఫలితాలను జులై 25న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 6,195 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. వీరికి ఆగస్టు 29, 30 తేదీల్లో ఆన్లైన్ విధానంలో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment