శంషాబాద్ కు అమిత్ షా రాక
షాద్ నగర్ జూలై 5, (way2newstv.in)
నందిగామ భాజపా మండల అద్యక్షులు బంటారం లక్ష్మణ్ గౌడ్ ఆద్వర్యం మండల కేంద్రం లో భాజపా మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి ,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దేపల్లి అశోక్ గౌడ్ హజరయ్యారు.
తెలంగాణ లో అధికారమే లక్షంగా అడుగులు వేస్తున్న భాజపా
శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శనివారం మద్యాహ్నం కేఎల్సీసీ ఫంక్షన్ హాల్ శంషాబాద్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. తెలంగాణ లో అధికారమే లక్షంగా అమిత్ షా దృష్టి పెట్టారని అన్నారు. అదేవిధంగా నియోజక వర్గం మొత్తం లో 50 వేల సభ్యత్వాలు చేసి రాష్ట్ర పార్టీకి అందించాలని అన్నారు .తెలంగాణ రాష్ట్రం లో వచ్చేది భాజపా ప్రభుత్వమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ ,తెరాస నేతలు కూడ భాజపా వైపు చూస్తున్నారని అన్నారు.
No comments:
Post a Comment