Breaking News

11/07/2019

ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా: ఈటల

కరీంనగర్ జూలై 11  (way2newstv.com
ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం  జిల్లాలో పర్యటన సందర్భంగా జమ్మికుంటలోని పాత వ్యవసాయ మార్కెట్‌లో రైతు బజార్‌ను మంత్రి ప్రారంభించారు.
ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా: ఈటల
ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. గ్రామాలు పట్టణాలుగా మారాయి. ఉపాధి హామీ పనులు లేవు. ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులు కల్పించినం. రాబోయే రోజుల్లో చికెన్, మటన్, చేపల మార్కెట్ నిర్మిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ విజయ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment