Breaking News

03/07/2019

ఈనెల ఐదున జూనియర్ కళాశాలల బంద్


విజయవాడ, జూలై 03(way2newstv.in)
జూనియర్ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 5 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్ కు పిలుపునిస్తున్నామని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి  హరీకృష్ణ  అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.

ఈనెల ఐదున జూనియర్ కళాశాలల బంద్


రాష్ట్రం లో కార్పొరేట్ విద్యాసంస్థల మాఫియా నడుస్తుంది,ఎన్నికల సమయం ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనసాగించాలని అన్నారు. కార్పొరేట్ విద్య వ్యవస్థను కట్టడి చేయాలి ,కార్పొరేట్ విద్య సంస్థల విధానాల వలన వందల మంది విద్యార్థు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనుమతి లేని కళాశాలలు,వసతి గృహాలపై చర్యలు తీసుకోవాలి. జీవో 35 ను రద్దు చేసి ఎయిడెడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని అయన డిమాండ్ చేసారు. 

No comments:

Post a Comment