వరంగల్, జూలై 9, (way2newstv.in)
కన్నె పల్లి పౌంప్ హౌజ్ ను మంగళవారం నాడు న పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అయన వెంట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లు పుట్ట మధు, జి. శ్రీ హర్షిని తదితరులు వున్నారు. మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక నమూనాగా నిలిచింది.
ప్రతి ఇంటికి మంచినీరు
కేసీఆర్ నాయకత్వంలో కోటి ఎకరాలకు నీరు అందించే గొప్ప కార్యక్రమం విజయవంతంగా మొదలైంది. కాళేశ్వరం సక్సెస్ తో తెలంగాణ అంతా పండగ వాతావరణం నెలకొందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఇంటికి మంచి నీరు అందుతోంది. కాళేశ్వరం తో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది. కాళేశ్వరం నిర్మాత, ఇంజనీర్ అంతా కేసీఆరే అని అయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment