హైదరాబాద్ జూలై 25 (way2newstv.in):
సీఎం కేసీఆర్కు హరీష్రావే టార్గెట్ అని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హరీశ్ను దెబ్బ తీయాలనే చింతమడకకు కేసీఆర్ వరాలు ప్రకటించారని అరుణ పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని అన్నారు.
హరీశ్ను దెబ్బ తీయాలనే చింతమడకకు కేసీఆర్ వరాలు: డీకే అరుణ
తెలంగాణ బీజేపీలో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. కార్యకర్తల ఒత్తిడితోనే సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలోకి రాలేదని అన్నారు. జూపల్లి కృష్ణారావు ఎక్కడికెళ్లినా జరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల భూములున్న చోటే ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. నేనే రాజు..నేనే మంత్రి అన్నట్లు కేసీఆర్ ప్రవర్తన ఉందని డీకే అరుణ విమర్శించారు.
No comments:
Post a Comment