Breaking News

06/07/2019

లింగమనేని వ్యవహారంపై దర్యాప్తు


మంగళగిరి జూలై 6, (way2newstv.in)
మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని  ,ఐ జేయం అక్రమాలు ఎన్ని చేశారో ప్రజలకు చెప్పాలి. అక్రమంగా లే ఔట్లు వేసి వెంచర్లు వేశారు. నిబంధనలను పాటించలేదు,సుమారు 40 ఎకరాల్లో లే ఔట్లు వేశారు. విలాసవంతమైన విల్లాలు కట్టి ఒక్కోడాన్ని 5 కోట్లకు అమ్ముకున్నారు. బిల్డింగ్ పర్మిట్,లే ఔట్ ఫీజు కాజా గ్రామానికి కట్టాల్సి ఉన్న ఇప్పటిదాకా కట్టలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. గజం విలువ 4 వేలు గా రిజిస్ట్రేషన్ విలువ చూపించారు. 

లింగమనేని వ్యవహారంపై దర్యాప్తు

సుమారు 40 నుండి 50 కోట్లు పంచాయితీ కి రావాల్సిన ఫీజు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టడమే కాకుండా పంచాయితీ మీదే కేస్ వేశారు,ఆ కేస్ లను బెంచ్ పైకి రాకుండ మేనేజ్ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిని విజిలెన్స్ దర్యాప్తు కొరతాం. ఒక్క నా నియోజకవర్గం లోనే 40 నుండి 50 కోట్లకు అక్రమాలకు పాల్పడ్డారు. కరకట్ట ఇల్లు ఇచ్చారు కాబట్టే చంద్రబాబు ఏమి మాట్లాడకుండా ఉండిపోయారని అన్నారు. విల్లాలు కొనుక్కున్న వాళ్లు అసలు విషయం  తెలియకుండా కొనుక్కున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సామాన్యులు అప్పులు తెచ్చుకుని కొనుక్కుని ,తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ బాగోతాలపై దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రిని కొరతామని అన్నారు. ప్రజలేవరు .మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దు. విజయవాడ క్లబ్ కూడా అక్రమ కట్టడమే,అనుమతి లేని ఏ భవనమైన సీఆర్డీఏ నోటీస్ లు ఇస్తుందని అనుకుంటున్నామని అన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందని అయన అన్నారు.

No comments:

Post a Comment