Breaking News

22/07/2019

మంత్రికి మాతృవియోగం

వనపర్తి జూలై 22 (way2newstv.in)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి తారక మ్మ 105 సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో మృతి చెందారు. ఆమె భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం నివాసం ముందు ఉంచారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి  మరణించిన విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు మంత్రి నివాసానికి విచ్చేసి ఘనంగా నివాళులర్పించారు. 
మంత్రికి మాతృవియోగం

ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లా ఎస్పీ అపూర్వ రావు లు మంత్రి నివాసానికి చేరుకుని తారక మ్మ మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మంత్రిని ఆయన కుటుంబ సభ్యులకు వారు వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా జిల్లా విలేకరుల బృందం. మరియు ఎలక్ట్రానిక్ మీడియా బృందం తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు. జెడ్ పిటిసి చైర్మన్ లోకనాథ్ రెడ్డి , విద్య శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, టిడిపి జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి లు ఆమెకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

No comments:

Post a Comment