Breaking News

24/07/2019

ఏపీ గవర్నర్ గా బిశ్వచందన్

విజయవాడ, జూలై 24  (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్‌‌కు తొలి గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ ఖుమార్ విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించారు. అయితే, ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒడిశాలో 1934 ఆగస్టు 3న జన్మించిన బిశ్వభూషణ్ హరిచందన్ బీఏ (హానర్స్‌), ఎల్ఎల్‌బీ చేశారు. 
ఏపీ గవర్నర్ గా బిశ్వచందన్

ఆయన తండ్రి పేరు పరశురాం హరిచందన్‌. కొంతకాలం లాయర్‌గా పనిచేసిన బిశ్వభూషణ్‌కు పుస్తక పఠనం, కథనాలు రాయడం అంటే ఎంతో ఆసక్తి. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం కూడా చాలా ఇష్టం. అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా సమాజం పోరాటం చేయాలని ఆశించే వ్యక్తిత్వం ఆయన సొంతం. సమాజంలోని పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పిస్తుంటారు. ఇక, 1971లో భారతీయ జన సంఘ్‌లో చేరిన బిశ్వభూషణ్ ఆ తరువాత ఆ పార్టీలో జాతీయ కార్యవర్గ సభ్యుడు అయ్యారు. అనంతరం ఆ పార్టీకి ఒడిశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1975లో బీజేపీలో చేరిన ఆయన 1980 నుంచి 1988 వరకు ఆ పార్టీ ఒడిశా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరువాత మళ్లీ 1988లో జనతా పార్టీలో చేరారు. తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్ 4న బీజేపీలో చేరారు. మరు బటాస్‌, రాణా ప్రతాప్‌, శేష ఝలక్‌, ఆస్తా శిఖ, మానసి అనే పుస్తకాలను రచించారు. భువనేశ్వర్ నుంచి 3 సార్లు, చిలిక నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేశారు. 

No comments:

Post a Comment