Breaking News

06/07/2019

ఈనెల 8న సీఐటీయూ ధర్నా


కర్నూలు జూలై 6, (way2newstv.in)
మద్యాహ్నభోజన పథకాన్ని ప్రవేటు సంస్థలకు అప్పగించరాదని జూలై8న కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నామని కోడుమూరు సిఐటియు డివిజన్ కార్యదర్శి మోహన్ అన్ఆరు.  సి బెళగల్ మండలంలో మద్యాహ్నభోజన కార్మికులు ఎమ్మార్వో ఆఫిస్ దగ్గర పార్క్ లో ఏర్పాటు చెసిన సమావేశంలో అయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడం దారుణమని అన్నారు. 

ఈనెల 8న సీఐటీయూ ధర్నా

మద్యాహ్నం భోజన పధకాన్ని ప్రవేటు సంస్థలకు అప్పగిస్తే రాష్ట్రంలో 25వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డులో పడుతారని, దాదాపు 15 సంవత్సరాలుగా అనేక కష్టనష్టాలను ఒడ్చి బిల్లును సంక్రమంగా రాకపొయినా  అప్పుచెసి వంటలు చెసి పిల్లలకు వడించి ఈ పధకాన్ని నిర్వఘ్నంగా  కోనసాగిస్తున్న కార్మికులను కాదని ప్రవేటు సంస్థను పధకాన్ని అప్పగించడం చాలా దుర్మర్గమైన చర్య  అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పధకాన్ని నవప్రియన్ సంస్థకు అప్పగించాలని ప్రయత్నిస్తె కార్మికులు ఉద్యమించారని అన్నారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే మద్యాహ్నంభోజన పధకాన్ని కార్మికులకే ఇస్తామని అదేవిధంగా కార్మికులకు గౌరవ వేతనం పెంచుతామని భరోపా ఇచ్చారని అయన అన్నారు. కార్మికులకు అండగా ఉండడంతో పాటు బిల్లులను సంక్రమంగా అందేలా చూస్తామని హమీ ఇచ్చారు. కాని నేడు అధికారంలోకి వచ్చిన తరువాత పధకాన్ని ప్రవేటు సంస్థలకు అప్పగింస్తామనడం సరైనాది కాదని అన్నారు. 

No comments:

Post a Comment