Breaking News

08/06/2019

టైం కలిసొచ్చి..మంత్రులైన ఈ ఏడుగురు


విజయవాడ, జూన్ 8 (way2newstv.in)
ఏపీ కేబినెట్ కొలువుదీరింది.. 25మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం  ఏపీ సెక్రటేరియెట్‌ ప్రాంగణంలో మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. ముఖ్యంగా కేబినెట్‌లో సీనియర్లకు పెద్దపీట వేశారు జగన్. అలాగే అనూహ్యంగా ఊహించని వారికి మంత్రి పదవులు కేటాయించారు. జిల్లాలు, సామాజిక వర్గాల లెక్కలతో అనూహ్యంగా పదవులు దక్కించుకున్నారు కొందరు నేతలు. అదృష్టం కలిసొచ్చి ఏడుగురు ఎమ్మెల్యేకు మంత్రి పదవులు దక్కాయి. ఎవరూ ఊహించని విధంగా వీరంతా మంత్రివర్గంలో బెర్త్ ఖాయం చేసుకున్నారనే చెప్పాలి. కేబినెట్‌లో స్థానం సంపాదించినవారిలో.. 


టైం కలిసొచ్చి..మంత్రులైన ఈ ఏడుగురు

తానేటి వనిత (కొవ్వూరు-పశ్చిమ గోదావరి జిల్లా) 
చెరుకువాడ రంగనాథరాజు (ఆచంట-పశ్చిమ గోదావరి జిల్లా) 
వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ ఈస్ట్-కృష్ణా జిల్లా)
అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ-నెల్లూరు జిల్లా) 
నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు-చిత్తూరు జిల్లా) 
శంకరనారాయణ (పెనుగొండ-అనంతపురం జిల్లా) 
గుమ్మనూరు జయరాం (ఆలూరు-కర్నూలు జిల్లా) 
వీరిలో శంకర్ నారాయణ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తానేటి వనిత, రంగనాథరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాంలు రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువమంది సామాజిక సమీకరణాల్లో భాగంగా పదవులు వరించాయి. 

No comments:

Post a Comment