Breaking News

06/06/2019

ఖాళీ అవుతున్న కాంగ్రెస్


సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయండి..
స్పీకర్ కు లేఖ ఇచ్చిన 12మంది ఎమ్మెల్యేలు
హైదరాబాద్ జూన్ 6, (way2newstv.in)
 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్  సీఎల్పీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్ను వీడిన 12మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస  రెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్ కు సమర్పించారు. 


ఖాళీ అవుతున్న కాంగ్రెస్
స్పీకర్ను కలిసిన వారిలో  సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్ రెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య  ఉన్నారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు.  రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం కోరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. వీరంతా అధికారికంగా టీఆర్ఎస్ లో చేరనప్పటికీ వారు కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు.దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే పోడెం వీరయ్య కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇక సాంకేతికంగా 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే... అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ కష్టమే. 

No comments:

Post a Comment