రంజాన్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.నెలరోజులపాటు బక్తి స్రద్దలతో చేసిన కటిన ఉపవాస దీక్షలు ముగిశాయి.నెలవంక చూపుతో ముస్లింలు రామ్జాన్ వేడుకల్లో మునిగిపోయారు.
ఆదిలాబాద్ లో రంజాన్ వేడుకలు
ఆదిలాబాద్,నిర్మల్ ,మంచిర్యాల ,కుమురంభీం, జిల్లాల్లో మసీదులు,దర్గాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు గంటపాటు ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.ఈ వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న,కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సుజాత పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment