Breaking News

01/06/2019

మోడీకి అరుదైన గౌరవం


న్యూఢిల్లీ, జూన్ 1, (way2newstv.in)
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 50 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. అత్యధిక మెజారిటీ ఓట్లు, సీట్లతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిగా ఎన్నిక కావడంపై ప్రపంచ దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశాల నుంచి సైతం ప్రతినిధులు హాజరయ్యారంటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 


మోడీకి అరుదైన గౌరవం
తాజాగా అబుదాబీ సైతం ఇండియాపై తమ అభిమానాన్ని చాటింది. ఆ దేశంలోని అడ్నోక్ టవర్స్‌పై ప్రధాని మోదీ చిత్రపటంతోపాటు జాతీయ జెండాను ప్రదర్శించారు. అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బీన్ జాయెద్‌ మోదీతో కరచలనం చేస్తున్న ఫొటోను ఇందులో ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోలు, వీడియోను అబుదాబీ భారత రాయబారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

No comments:

Post a Comment