Breaking News

28/05/2019

జూన్ లో ఆపరేషన్ కన్నడ స్కెచ్


బెంగళూర్, మే 28 (way2newstv.in
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. కర్ణాటకలో సంకీర్ణ సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలు ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. దీంతో.. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోలి, కె.సుధాకర్‌లు ఆదివారం బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణను కలిశారు. మాజీ డిప్యూటీ సీఎం ఆర్ అశోక వీరి వెంట వచ్చారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, మండ్య నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన సుమలత ఎస్ఎం కృష్ణను కలవడానికి వచ్చారు. 


జూన్ లో ఆపరేషన్ కన్నడ స్కెచ్
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి.. దారుణ పరాభవం పాలైన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 12 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు.. బీజేపీలోకి గోడ దూకేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇదే జరిగితే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాము సిద్ధంగా లేమని బీజేపీ చెబుతోంది. కానీ.. ‘కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారు తమ పదవులకు రాజీనామా చేసి మా పార్టీ టికెట్ మీద ఉపఎన్నికల్లో పోటీ చేస్తామంటే.. వారిని చేర్చుకోవడానికి మాకు అభ్యంతరం లేదు’ అని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. యడ్డీ మాటలను బట్టి.. విపక్ష ఎమ్మెల్యేలను నేరుగా తమ పార్టీలో చేర్చుకోకుండా.. వారితో రాజీనామా చేయించి కమలం గుర్తుపై గెలిపించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో మోదీ హవా ఉన్న నేపథ్యంలో ఇదేం పెద్ద కష్టం కాబోందని ఆ పార్టీ భావిస్తోందనిపిస్తోంది.225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్‌ (79), జేడీఎస్ (37), బీఎస్పీ (1)లకు 117 మంది సభ్యుల బలం ఉంది. 

No comments:

Post a Comment