Breaking News

01/05/2019

వాళ్లిద్దరిని కలిపిన ట్రాఫిక్ చలానా

గాంధీనగర్, మే 1, (way2newstv.in)
ట్రాఫిక్ చలానాకు ప్రేమకథకు లింకేంటనుకుంటున్నారా.. నిజంగానే.. ఓ ట్రాఫిక్ చలానా ప్రేమజంటను కలిపింది. అన్ని లవ్ స్టోరీలకు విభిన్నంగా ఎంగేజ్‌మెంట్‌తో పుల్‌స్టాప్ పడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ వెరైటీ ప్రేమ్ కహానీ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఏకంగా పోలీసులే ఈ ప్రేమ జంట కథను చూసి ఫిదా అయ్యారంటే.. మామూలు స్టోరీ కాదు. అసలు విషయానికొస్తే.. అహ్మదాబాద్‌కు చెందిన వాత్సల్ పరేఖ్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ జంట రోజూ బైక్‌పై చెట్టాపట్టాలేసుకొని మరి తిరుగుతోంది. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలియదు. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం పరేఖ్ ప్రియురాలితో కలిసి జాలీగా నగరంలో తిరిగాడు. 


వాళ్లిద్దరిని కలిపిన ట్రాఫిక్ చలానా

అయితే ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ జంట నిఘా నేత్రానికి (సీసీ కెమెరాకు) దొరికిపోయింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్ క్రాస్ చేసి.. జీబ్రా లైన్‌పైకి బైక్ వెళ్లింది. ఇంకేముంది సిగ్నల్స్ దగ్గరున్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. నేరుగా ఇంటికి ట్రాఫిక్ పోలీసులు చలానా పంపారు. చలానాలో ఫోటో చూసి పరేఖ్ తల్లిదండ్రులు కంగుతున్నారు. కుమారుడి బండి వెనుక అమ్మాయిని చూసి షాకయ్యారు. అమ్మాయి గురించి ఆరా తీయగా.. ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పాడు. పరేఖ్ నిజాయితీగా తన ప్రేమ గురించి చెప్పడంతో తల్లిదండ్రులు ఓకే చెప్పారు. నేరుగా వెళ్లి యువతి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితో వారికి పెళ్లి కుదిరింది. రెండు రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. దీంతో పరేఖ్ అహ్మదాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. ఓ ట్వీట్ చేసి.. జరిగిన స్టోరీ చెప్పాడు. పోలీసులు కూడా ఈ ట్వీట్, ఫేస్‌బుక్ పోస్టులకు లైక్ కొట్టింది. మొత్తానికి పరేఖ్ తన లవ్ స్టోరీతో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యాడు. ప్రియురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు

No comments:

Post a Comment