Breaking News

17/05/2019

ఎండలు బాబోయ్ ఎండలు

నిర్మానుష్యంగా మారిన రోడ్లు రహదార్లు
కౌతాళం మే 17 (way2newstv.in)
మండల కేంద్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకే భానుడి భగభగ మండు తున్నాడు. దీంతో జనం రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. జనం లేక రోడ్లు  నిర్మానుష్యంగా మారుతున్నాయి.
 శుక్రవారం కౌతళం మండలం లో  42  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 


ఎండలు బాబోయ్ ఎండలు 

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగు తున్నాయి. వివిధ గ్రామాల నుంచి జనం వస్తుంటారు.అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయలేదనీ జనం రద్దీగా ఉన్న సెంటర్ లో ప్రభుత్వ చాలి వేంద్రలు ఏర్పాట్లు చేయాలని కోరారు.సూర్యుడికి బార్య ఉంటె బాగుండేది అని కంట్రోల్ లో ఉండే వారేమో అని జనం నవ్వుకుంటున్నారు.

No comments:

Post a Comment