Breaking News

03/05/2019

అవెంజర్స్ సినిమా చూసిన వైఎస్ జగన్..

హైదరాబాద్ మే 3 (way2newstv.in)
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్లో ఆయన సినిమా చూడటానికి వచ్చారు.  అవెంజర్స్ చూడడానికి ఆయన వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో, అందుకు తగిన ఏర్పాట్లు చేశారు థియేటర్ సిబ్బంది. మల్టీఫ్లెక్స్ లోని స్క్రీన్ ఫైవ్ లో అన్నీ రిక్లయినర్లు(హై ఎండ్ పుష్ బ్యాక్ సీట్లు) వుంటాయి.


అవెంజర్స్ సినిమా చూసిన వైఎస్ జగన్..

అది కూడా చాలా లిమిటెడ్ సీట్లు. ఈ స్క్రీన్ ను జగన్ ఫ్యామిలీ కోసం బ్లాక్ చేశారు. జగన్ వచ్చిన సందర్భంగా సాధారణ ప్రేక్షకులు వచ్చి, ఫొటోలు తీయడానికి వీలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రీన్ 5 సీట్లు అన్నీ బ్లాక్ చేసినా, జగన్ అండ్ ఫ్యామిలీ కొద్దిమందే సినిమా చూశారు. జగన్ తన సన్నిహితుడైన ఓ బిల్డర్ తో కలిసి థియేటర్ కి వచ్చారు..

No comments:

Post a Comment