Breaking News

27/05/2019

బీజేపీపై విషప్రచారం చేసారు


న్యూఢిల్లీ మే 27 (way2newstv.in)
ఏపీ రాజధాని కి ఎంత భూమి అవసరమో అంతే ఉంచుకొని మిగితా భూములను ఏ పేదలనుంచి తీసుకున్నారో వారికే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించడంతోనే బీజేపీ జైత్రయాత్ర ముగుస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్  రెడ్డి అన్నారు. సోమవారం అయన ఢిల్లీలోని ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ తో విడిపోయిననాడే టీడీపీ పతనం ప్రారంభం అయింది. చంద్రబాబు బీజేపీ పై విషప్రచారం చేశారు టీడీపీ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని అన్నారు. 


బీజేపీపై విషప్రచారం చేసారు
రాయలసీమ లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. కొత్త ప్రభుత్వం రాయలసీమ శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి కి నిర్మాణాత్మక సూచనలు చేస్తాం. ప్రభుత్వంలో చేరడం ప్రధాన అంశం కాదు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండా. ఎనర్జిఎస్ పథకం లో భాగంగా గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వన్నీ నిధులు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావడంలో చంద్రబాబు దిట్ట. రాష్ట్రానికి వచ్చిన నిధులు క్షేత్రస్థాయికి వెళ్లయొలేదో శ్వేతపత్రం విడుదల చేయాలి. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క పోర్టు నిర్మాణం చేపట్టలేదని అన్నారు. శాశ్వత రాజధాని నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక రాజధాని అంటూ అనవసర అంశాలపై ఎక్కువ దృష్టిసారించారు. రాష్ట్రభివృద్దే పార్టీ అభివృద్ధిగా భావించి కేంద్ర సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

No comments:

Post a Comment