Breaking News

23/05/2019

భారీ మేజారిటీ సాధించిన తెరాస అభ్యర్ధులు


హైదరాబాద్ మే 23   (way2newstv.in)  
తెలంగాణ రాష్ట్రం లో జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది టిఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు.  వరంగల్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. అయనకు 566367 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన దొమ్మటి సాంబయ్యకు 240101 ఓట్లు వచ్చాయి. మూడవస్థానంలో  బిజెపి అభ్యర్థి చింత సాంబమూర్తి 77325 ఓట్లు పోలయ్యాయి. 


భారీ మేజారిటీ సాధించిన తెరాస అభ్యర్ధులు 
అదేవిధంగా ఖమ్మంలో నామా నాగేశ్వర రావు లక్షా 66 వేల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై ఘన విజయం సాధించారు. మహబూబాబాద్ లో తెరాస అభ్యర్ధి మాలోత్ కవిత 77 వేల మెజార్టీతో గెలుపొందారు. మెదక్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి డీకే ఆరుణపై ఘన విజయం సాధించారు.  శ్రీనివాస్రెడ్డి 282255 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి డికె అరుణ 225851 ఓట్లు సాధించగా, కాంగ్రెస్   అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి 119950 ఓట్లు సాధించారు. నాగర్ కర్నూల్ లో టిఆర్ఎస్ అభ్యర్థి రాములు విజయం సాధించారు.

No comments:

Post a Comment