వరంగల్, మే 18 (way2newstv.in):
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టి ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టి ఓ చిన్నారి దుర్మరణం
దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన దంపతులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment