Breaking News

03/05/2019

ఎన్నికలు ప్రశాంతంగా జరుగాలి

కలెక్టర్ కృష్ణ బాస్కర్
సిద్దిపేట, మే 03 (way2newstv.in)
జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న జెడ్పిటిసి , ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ , మండల అధికారులు , నోడల్ అధికారులను ఆదేశించారు . ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని  ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు పౌరులందరు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు .


ఎన్నికలు ప్రశాంతంగా జరుగాలి

తదనంతరం పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు , మద్యం , డబ్బులు తదితర ప్రలోభాలు జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మకర్ , డి.ఆర్.ఓ చంద్ర శేఖర్ , డి.పి.ఓ సురేష్ బాబు , నోడల్ అధికారులు , యం. పి.డి.ఓ లు , పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment