Breaking News

27/05/2019

జూన్ 21న విడుద‌ల‌వుతున్న `మ‌ల్లేశం`


ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌, ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన వ్య‌క్తి చింత‌కింది మ‌ల్లేశం  బ‌యోపిక్ `మ‌ల్లేశం` రూపొందుతుంది. బ‌యోపిక్‌లో ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజ్.ఆర్ ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 


జూన్ 21న విడుద‌ల‌వుతున్న `మ‌ల్లేశం`
అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 21న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది. ఝాన్సీ, అన‌న్య స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలు శాండిల్య‌స సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌రలోనే ఈసినిమా ట్రైల‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. న‌టీన‌టులు:  ప‌్రియ‌ద‌ర్శి   ఝాన్సీ  అనన్య‌ చ‌క్ర‌పాణి తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు 

No comments:

Post a Comment