ఓట్లు, సీట్లు లేని, తెలంగాణ సీఎంకు ఇక్కడేం పని: తెదేపా ఎంపీ కనకమేడల
అమరావతి ఏప్రిల్ 9 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్లో ఓట్లు, సీట్లు లేని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఇక్కడేం పని అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరికే వైకాపా పుట్టుకకు కారణం తప్ప ఆ పార్టీకి సిద్ధాంతాలేమీ లేవని విమర్శించారు. కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కావాలన్న కోరికే వైకాపా పుట్టుక
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారని నమ్మి మోసపోయామని చెప్పారు. నదుల అనుసంధానం, పోలవరం, పట్టిసీమపై జగన్ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. పోలవరం ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కేసీఆర్ వెనక్కి తీసుకుంటారా?అని ప్రశ్నించారు. మోదీ దర్శకత్వంలో కేసీఆర్, జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు.
No comments:
Post a Comment