Breaking News

13/04/2019

చంద్రబాబు చెల్లని రూపాయి

విజయవాడ, ఏప్రిల్ 13  (way2newstv.in)   
ఏపీ లో ఎన్నికలు ముగిసిన తరువాత., టీడీపీ ఓటమి ఖాయమైందని బాబు గ్రహించారు. ఓటు వేసి వచ్చిన తరువాత గంట రెండు గంటల్లోనే ముప్పై శాతం ఈవీఎంలు పని చెయలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నాడని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు. శనివారం అయన మీడియాతోమాట్లాడారు. తన దగ్గరికి 5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని వచ్చారని చెప్పటం చూస్తే బాధ్యతయుత పదవి లో ఉన్న నీ దగ్గరకు రావడం అంటే మీ కార్యాలయం ఏమైనా దొంగలకు అడ్డానా బాబు చెప్పాలి. ఈ దేశంలో ఈవీఎంల దొంగల ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ టీడీపీ నేతలు మాత్రమే. ఈవిమ్ లో మ్యానేజ్ చేస్తాము అని వచ్చిన వారిపైన నీవు ఈసీ కి ఎందుకు పిర్యాదు చేయలేదని అయన ప్రశ్నించారు. మహారాష్ట్ర లో ఈవిమ్ దొంగతనం చేసిన హరిప్రసాద్ ను ఐటీ సలహాదారు గా ఎలా పెట్టుకున్నారు. ఈవిమ్ దొంగలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఐటీ గ్రిడ్ దొంగలు కూడా టీడీపీ నేతలే.ఆంద్రప్రదేశ్ దొంగలంతా చంద్రబాబు పక్కనే ఉన్నారని అయన విమర్శించారు. 


చంద్రబాబు చెల్లని రూపాయి

ఈవీఎంలు, ఐటీ గ్రిడ్ చోర్ లకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఈ విషయంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. దేశంలో ఉన్న ప్రతిపక్షాలను కలుస్తా అని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. నా ఓటు నాకే పడిందో లేదో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిఫ్యాట్స్లు కావాలని చెప్పింది చంద్రబాబే కదా ఇప్పుడేమైంది. మహంతి కుటుంబానికి మంచి పేరు ఉంది అలాంటి అతన్ని కడప నుండి ఎందుకు బదిలీ చేశారని అన్నారు. వ్యవస్థ లో పని చేసే ఏ ఒక్క అధికారిని గౌరవించరు. ఈడీ, సీబీఐ లు రావొద్దని జీవో లు ఇస్తాడు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని అన్నారు. తిట్ల దండకం తో టీడీపీ కి ఓట్లు వేస్తారా. మోడీ ని తిడితే ఓట్లు పడవు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో పని మనుషుల్లాగా చూస్తారని అన్నారు. ఇలాంటి వాటిని చూస్తే బాబు మానసిక స్థితి పై అనుమానం కలుగుతుంది.  చంద్రబాబు చెల్లని రూపాయి. ఈవీఎంల పేరుతో ఢిల్లీ లో డ్రామా మొదలుపెట్టారు బాబు. అమరావతి నుండి ఢిల్లీ కి దుకాణం మార్చారు. ఆంధ్ర లో చెల్లని రూపాయి చంద్ర బాబు దేశంలో ఏ రాష్ట్రంలో చెల్లుతుందని అయన వ్యాఖ్యానించారు.  తెలంగాణ లో టీడీపీ జెండా పీకారు. ఆంధ్ర లో జెండా ఎత్తేశారు. టీడీపీ లో ఏ ఒక్కరు మిగలరు.. టీడీపీ కి ఓటేస్తే బీజేపీ కి పడుతుంది అంటున్న మీరు మాకు ఒకవేళ ఓట్లు రాకపోతే ఈవీఎంలను బాబు మేనేజ్ చేసినట్టేనా.. నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎస్ ను బెదిరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో డీజీపీ తప్పించాలని లేఖ రాసి మార్పించు కున్నారు.. కానీ ఇప్పుడు మారిస్తే తప్పా?  రికార్డుల తాంపారింగ్ పై విచారణ జరపాలి. ఆంద్రలో ప్రత్యామ్నాయం బీజేపీయే. టీడీపీ నేతలు ఓటమి పాలవుతున్నామని తెలిసి ఇష్టానుసారంగా ప్రవర్తించారని విమర్శించారు. 

No comments:

Post a Comment