Breaking News

09/04/2019

సెన్సార్ పూర్తయిన చిత్రలహరి

హైద్రాబాద్, ఏప్రిల్ 8, (way2newstv.in)
మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ.. తొలి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’తోనే నటుడిగా మంచి గుర్తింపు.. ‘సుప్రీం’తో కమర్షియల్ హీరో మార్క్.. ఇవేవీ సాయి తేజ్‌కు కలిసి రాలేదు. ‘సుప్రీం’ తరవాత వరసగా వచ్చిన ఆరు సినిమాలూ ఫ్లాపే. కృష్ణవంశీ, వి.వి.వినాయక్, కరుణాకరన్ లాంటి సీనియర్ దర్శకుల చేతుల్లో పడినా తేజూకి కలిసిరాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి తన అభిమానులకు బహుమతిగా ఇవ్వాలనే పట్టుదలతో ‘చిత్రలహరి’ సినిమాను చేశారు సాయి తేజ్. తన గత చిత్రాలకు భిన్నంగా ‘లూజర్’ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ‘నేను శైలజ’ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 


సెన్సార్ పూర్తయిన చిత్రలహరి

అన్నిటికీ మించి టాలీవుడ్‌లో ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ కంపెనీగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ‘చిత్రలహరి’ని నిర్మించింది. అందుకే సాయి తేజ్‌తోపాటు ఆయన అభిమానులు సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాకుండా ఒక్క కట్ కూడా చెప్పలేదు. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలని తెలుస్తోంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చాలా బాగుందని ప్రశంసించారట. దీంతో సాయి తేజ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాతో తేజూకి కచ్చితంగా బ్రేక్ వస్తుందని ఆశపడుతున్నారు. సాయి తేజ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం. 

No comments:

Post a Comment