Breaking News

25/04/2019

రాకాసి అలలతో జరా భద్రం

విశాఖపట్టణం, ఏప్రిల్ 25, (way2newstv.in)
ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అలల ఉధృతికి అవకాశం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఉంటాయని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికరలు జారీ చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది.. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు... తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.. 
 

రాకాసి అలలతో జరా భద్రం

తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌కాయిస్ తెలిపింది.అండమాన్ నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని వెల్లడించింది. అలల ఎత్తు దాదాపుగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని పేర్కొంది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండు రోజులూ సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకుండా నిరోధించాలని స్పష్టం చేసింది. సముద్ర ఉపరితలం నుంచి గాలులు 45- 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్‌‌పై ఈ అలల ఉధృతి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆఫ్రికా తీరంలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో భారీ అలలు ఏర్పడి, ఇప్పటికే పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది

No comments:

Post a Comment